కువైట్లో భారీ రైడ్స్: 10 యూనిట్లు సీజ్..60 మంది అరెస్టు..!!
- August 17, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం తాగి పలువురు మరణించిన నేపథ్యంలో కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు, భద్రతా అధికారులు పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. ఈ సందర్భంగా 10 నకిలీ మద్యం యూనిట్లను గుర్తించి సీజ్ చేశారు. వీటితో సంబంధం ఉన్న దాదాపు 67మందిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యానికి సంబంధించిన ఒక ప్రధాన నెట్వర్క్ను పూర్తి స్థాయిలో నిర్మూలించినట్లు అధికారులు తెలిపారు.
మిథనాల్ వినియోగం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని, ఇది తరచుగా మరణాలకు దారితీస్తుందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది. మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!







