ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్ రియాలిటీ షో.. 'షో టైం'
- August 18, 2025
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు.సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
'షో టైం' సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు.దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. చాలామంది సినిమా తీయాలన్నా కళతో తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా నిర్మిస్తారు కానీ దాన్ని విడుదల చేయడానికి చాలా కష్టాలు పడతారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూసానని అనిల్ సుంకర చెప్పారు. అలాగే ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగిందని, ప్రొడక్షన్ లో చాలావరకు అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో సినిమా తీసే నిర్మాతకు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఈ రియాల్టీ షో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
అన్ని రియాల్టీ షోలా మాదిరిగానే ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేని రియాల్టీ షో అని, ఇది ఒక ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్ అవబోతుందని దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు.ఇక ఈ షో కు మొత్తం 16 స్క్రిప్ట్లను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్ స్క్రిట్లను 12 మంది జడ్జీలు ఫైనల్ చేస్తారని తెలిపారు.ఆ ఫైనల్ అయిన స్క్రిప్ట్లకు అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను ఆర్టిస్టులను షోలోనే ఎన్నుకుంటారని వివరించారు. ఇక ఆ స్క్రిప్ట్స్ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బెడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయల లో కేవలం 30 రోజులలోనే సినిమా పాటలతో సహా షూటింగ్ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేయబోతున్నట్లు వివరించారు.ఈ రియాల్టీ షో కి సంబంధించి ఆ తర్వాత షో గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







