భారత్ వ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..

- August 18, 2025 , by Maagulf
భారత్ వ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..

ఎయిర్‌టెల్‌ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌(Airel) యూజర్లు మొబైల్ డేటా(Mobile Data) సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాయిస్‌ సర్వీసెస్ కూడా పనిచేయలేదు. సాయంత్రం 4.04 PM గంటలకు 2300 మందికి పైగా యూజర్లు తమ సేవలకు అంతరాయం కలగడంపై ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌ పేర్కొంది. అయితే సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ వెల్లడించింది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి
చాలామంది యుజర్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా మొబైల్ రీచార్జ్‌ చేసుకున్నప్పటికీ మొబైల్‌ డేటా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో ఇలా నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడంపై మండిపడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో యూజర్లు సిగ్నల్స్ రాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com