ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి..
- August 19, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఉదయం కూటమి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పీసీ రాధాకృష్ణన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇండియా కూటమి అభ్యర్థిగా సుందర్శన్ రెడ్డి పేరు ప్రకటన సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బి. సుదర్శన్ రెడ్డి భారతదేశంలో అత్యంత విశిష్టమైన, ప్రగతిశీల న్యాయ నిపుణుల్లో ఒకరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారని చెప్పారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన సుదర్శన్ రెడ్డి.. పేదల పక్షపాతిగా, రాజ్యాంగం, ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఎంతో కృషి చేశారని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







