దళారులను నమ్మకండి..భక్తులకు TTD సూచన
- August 19, 2025
తిరుమల: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే వెళ్తుంటారు. టీటీడీ కూడా భక్తుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా దర్శనం టికెట్ల ను రిలీజ్ చేస్తుంటుంది. అయితే స్వామి వారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.గత సంవత్సరం ఆగస్టు 16న వనం నటరాజ నరేంద్రకుమార్, కేఎస్ నటరాజశర్మ అనే ఇద్దరు వ్యక్తులు స్వామి వారి వీఐపీ దర్శనం కోసం రూ.90వేలు తీసుకున్నారని.. టికెట్ల కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా..స్పందించడం లేదని విశ్వనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. స్వామి వారి దర్శనం కోసం దళారులను నమ్మొద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లోనే బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా నిందితులు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని.. వారిపై 12 కేసులు నమోదు అయినట్లు విచారణలో తేలింది. దళారులను గుర్తిస్తే 0877-2263828లో ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!