అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- October 11, 2025
వాషింగ్టన్: ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిలీస్టుతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మెషల్ బిన్ హమద్ అల్-థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తోపాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







