అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- October 11, 2025
వాషింగ్టన్: ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిలీస్టుతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మెషల్ బిన్ హమద్ అల్-థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తోపాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









