అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- October 11, 2025
వాషింగ్టన్: ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిలీస్టుతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మెషల్ బిన్ హమద్ అల్-థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తోపాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







