ఏపీఎస్ఆర్టీసీ: ఇక ఏసీ బస్సులే …
- August 22, 2025
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్ సర్వీసుల్లో 20 లక్షల మంది మహిళలలు ఈ సేవను వినియోగించుకుంటారని భావిస్తే..ఈ సంఖ్య విపరీతంగా పెరినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ తిరుమల్ రావు వెల్లడించారు. పొన్నూరు ఆర్టీసీ డిపో లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు శుక్రవారం బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది మహిళలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని, ఆర్టీసీ సిబ్బందికి సూచించారు.
ఎటువంటి గొడవలకు అవకాశం ఇవ్వవద్దని, ఈ పథకంతో ఆర్టీసీకి నష్టం రాదని బకాయిలను ప్రభుత్వం సకాలం చెల్లిస్తుందని ఆయన వివరించారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెన్షన్ పెరుగుతుందని, అందరికీ మంచి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు తెస్తామని, కొత్త బస్సులు తీసుకు వచ్చి ఏసీ బస్సులుగా మారుస్తామని, అత్యధికంగా ఏసీ బస్సులే నడుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







