ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం ప్రత్యేకత
- August 23, 2025
హైదరాబాద్: 2025లో వినాయక చవితి ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 గణేష్ వరకు జరుగుతుంది. పది రోజుల పాటు భక్తులు గణేష్ విగ్రహాలను ఇంట్లో, వీధుల్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అనంత చతుర్దశి విశిష్టత
భాద్రపద శుక్ల పక్ష చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని నమ్మకం. మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం ప్రాముఖ్యతను వివరించాడు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం
అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ఇదే రోజు నిమజ్జనం అవుతుంది. దీంతో ఆ ఏడాది గణేష్ ఉత్సవాలు ముగుస్తాయి.
గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడింది.
తాజా వార్తలు
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్









