పంజాబ్ లో గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి
- August 24, 2025
పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని మండియాలలో శుక్రవారం రాత్రి ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ఒక ట్రక్కును ఢీకొట్టడంతో తీవ్ర విషాదం మిగిలింది. ఢీకొన్న కొద్దిసేపటికే ట్యాంకర్లోని గ్యాస్ లీకై, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పేలుడు సంభవించింది.
ప్రాథమికంగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన పలువురు ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఆదివారానికి మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై హోషియార్పూర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందించారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్లు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మంటలను అదుపులోకి తేవడానికి గంటల పాటు ప్రయత్నాలు జరిపినట్లు చెప్పారు.
ట్రక్కును ఢీకొట్టిన తర్వాత ట్యాంకర్లో గ్యాస్ లీక్ కావడం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్యాస్ లీకేజీ తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వారు వెల్లడించారు.
ప్రమాదంలో గాయపడిన వారిని పంజాబ్ మంత్రి రవ్జోత్ సింగ్ స్వయంగా ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







