సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి..
- August 24, 2025
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వాన్ని దాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చిరంజీవి కోటి రూపాయలు ఇచ్చారు.ఇందుకు సంబంధించిన చెక్కుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిరు అందించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా చిరు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించడంతో ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చిరు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం కార్యాలయంలోనే ఈ చెక్కును అందజేశారు.
తన సాయం ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసరాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఉపయోగపడుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
చిరంజీవికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటారని అభినందించారు.
కాగా, ఇలాంటి విరాళాలు మరికొందరిని కూడా సహాయక చర్యలకు స్ఫూర్తినిస్తాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం చేస్తూ అనేక మందికి తోడ్పడ్డారు. తాజాగా, ఆయన చేసిన విరాళం ఆయనకు ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధతను మళ్లీ తెలియజేస్తోంది.
చిరంజీవి ఇటీవలే తన 70వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







