ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడి విగ్రహం..
- August 24, 2025
భారతదేశం అనేక సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను పాటించే దేశం. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తన ప్రత్యేక చరిత్ర, వంటకాలు, పండుగలు ఉన్నాయి.
భారతదేశ ప్రజలు గణేశుడు, శ్రీరాముడు, శివుడు వంటి అనేక దేవుళ్లను ఆరాధిస్తారు. ఇవి దేశ ఆధ్యాత్మిక ధార్మిక సంపదను ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం దేశంయావత్తు వినాయకచవితి కోసం ఎదురుచూస్తోంది.
వినాయక చవితి రోజున గణేశుడి విగ్రహాలకు పూజలు చేస్తాం. అయితే, ప్రపంచంలోనే ఎత్తైన గణేశుడు విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? భారత్లో కాదు.. థాయ్లాండ్లో ఉంది.
ప్రపంచంలో ఎత్తైన గణేశుడి విగ్రహం థాయ్లాండ్లోని చాచోఎంగ్సావో ప్రావిన్స్లో ఉంది. దీని ఎత్తు 39 మీటర్లు. ఇది కంచు విగ్రహం. గణేశుడు విఘ్ననాశకుడు, జ్ఞాన దేవుడిగా పూజలు అందుకుంటాడు. థాయ్లాండ్లో బ్రాహ్మణిజం కాలం నుంచి గణేశుడిని ఆరాధిస్తున్నారు. ఆయన జ్ఞానం, విజయము, రక్షణకు ప్రతిరూపంగా థాయ్ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
39 మీటర్ల ఎత్తైన ఈ గణేశుడి విగ్రహం ఖ్లాంగ్ ఖుయాన్ గణేశ్ ఇంటర్నేషనల్ పార్క్లో ఉంది. ఇది 2012లో పూర్తయింది. నిర్మాణానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహాన్ని 854 కంచు ముక్కలతో నిర్మించారు. ఇది 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. బాంగ్ పాకాంగ్ నది తీరంలో ఈ విగ్రహం రహదారి నీటి మార్గంలో ప్రయాణించే వారికి కనబడుతుంది.
గణేశుడి నాలుగు చేతుల్లో చెరుకు, పనస, అరటిపండ్లు, మామిడి పండ్లు ఉంటాయి. ఇవి వృద్ధి, ఆశీర్వాదాలను సూచిస్తాయి. ఆయన అడుగు దేశం ముందుకు సాగడాన్ని సూచిస్తుంది. తామర కిరీటం జ్ఞానాన్ని సూచిస్తుంది. పైభాగంలో ఉన్న “ఓం” ఆయన రక్షకుడి స్థానాన్ని గుర్తుచేస్తుంది.
థాయ్లాండ్లో ప్రజలు తమ ఇళ్లలో, విశ్వవిద్యాలయాలలో, కొన్ని కార్యాలయాలలో గణేశుడు విగ్రహాలు చిత్రాలు ఉంచుతారు. దీని వల్ల అదృష్టం, ఆశీర్వాదం పొందుతామని అనుకుంటారు. థాయ్లాండ్ అంతటా గణేశుడి ఉత్సవాలు జరుగుతాయి.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







