మలేసియా తెలుగు ఫౌండేషన్ మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ మోహన్, ప్రదీప్
- September 02, 2025
కౌలాలంపూర్: మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మరియు ప్రముఖ తెలుగు నటుడు ప్రదీప్ సన్మానార్థంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ విందుకు స్థానిక ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా TEAM (తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్) కోశాధికారి డాక్టర్ నాగరాజు సూర్యదేవర, FNCA-Malaysia ( ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్–మలేసియా) అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, BAM (భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ) ప్రెసిడెంట్ సత్య, MYTA (మలేషియా తెలంగాణ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ మరియు ఇతర ప్రముఖ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ గారు మలేసియాలోని భారతీయ ప్రవాసుల జీవన పరిస్థితులపై చర్చించారు. ప్రత్యేకంగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, వారికి ఎదురవుతున్న కష్టాలు పై విచారణ చేశారు. కొత్తగా వచ్చిన ప్రవాస భారతీయులకు సహాయం అందించాలని విజ్ఞప్తి ఆయన చేశారు.
“మలేసియాలో కొత్తగా వచ్చే ప్రవాసులకు ఉద్యోగ అవకాశాలు, తాత్కాలిక ఆశ్రయం, అవసరమైన మద్దతు అందించడంలో మనందరం కలిసి పనిచేయాలి.మనలో ప్రతి ఒక్కరి భాద్యత ఇది,” అని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ప్రదీప్ పాల్గొనడం వలన మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన సంఘ సభ్యులతో సానుకూలంగా మమేకమయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







