మలేసియా తెలుగు ఫౌండేషన్ మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ మోహన్, ప్రదీప్
- September 02, 2025
కౌలాలంపూర్: మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి మురళీ మోహన్ మరియు ప్రముఖ తెలుగు నటుడు ప్రదీప్ సన్మానార్థంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ విందుకు స్థానిక ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా TEAM (తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్) కోశాధికారి డాక్టర్ నాగరాజు సూర్యదేవర, FNCA-Malaysia ( ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్–మలేసియా) అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, BAM (భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ) ప్రెసిడెంట్ సత్య, MYTA (మలేషియా తెలంగాణ అసోసియేషన్) జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ మరియు ఇతర ప్రముఖ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ గారు మలేసియాలోని భారతీయ ప్రవాసుల జీవన పరిస్థితులపై చర్చించారు. ప్రత్యేకంగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, వారికి ఎదురవుతున్న కష్టాలు పై విచారణ చేశారు. కొత్తగా వచ్చిన ప్రవాస భారతీయులకు సహాయం అందించాలని విజ్ఞప్తి ఆయన చేశారు.
“మలేసియాలో కొత్తగా వచ్చే ప్రవాసులకు ఉద్యోగ అవకాశాలు, తాత్కాలిక ఆశ్రయం, అవసరమైన మద్దతు అందించడంలో మనందరం కలిసి పనిచేయాలి.మనలో ప్రతి ఒక్కరి భాద్యత ఇది,” అని మురళీ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు ప్రదీప్ పాల్గొనడం వలన మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన సంఘ సభ్యులతో సానుకూలంగా మమేకమయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







