విద్యార్థులకు శ్యాట్ వర్సెస్ యాక్ట్ పై NATS అవగాహన సదస్సు
- September 02, 2025
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేసడుతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఫ్రమ్ యావరేజ్ టూ ఐవీ, శ్యాట్ వర్సెస్ యాక్ట్ షో డౌన్ పేరుతో వెబినార్ నిర్వహించింది.ఈ వెబినార్లో దాదాపు 55 కుటుంబాలకుపైగా హాజరయ్యాయి. ఈ వెబినార్ ద్వారా తమ పిల్లల ఉన్నత విద్య భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు వచ్చాయి.
నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నాయకత్వంలో, సుకేశ్ సబ్బాని సమన్వయకర్తగా ఈ వెబినార్ను నిర్వహించారు. ప్రముఖ విద్యా నిపుణురాలు,ఎడ్యుఫిట్ టెస్ట్ ప్రిప్ వ్యవస్థాపకురాలు రీమా చితాలియా ముఖ్య వక్తగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో పూర్వ విద్యార్థిని అయిన రీమా, గతంలో డెలాయిట్ సైబర్ రిస్క్ కన్సల్టెంట్గా పనిచేసిన అనుభవంతో పాటు, వేలాది మంది విద్యార్థులను శాట్, యాక్ట్ పరీక్షల్లో ఉన్నత స్కోర్లు సాధించేలా మార్గనిర్దేశం చేశారు.
ఈ వెబినార్లో ఆమె డిజిటల్ శాట్ పరీక్షలోని రెండు-మాడ్యూల్ వ్యవస్థ, ఐటెమ్ రెస్పాన్స్ థియరీ (IRT) స్కోరింగ్ విధానం, ఇంగ్లీష్, గణిత విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే వ్యూహాలను వివరించారు. ముఖ్యంగా, విద్యార్థులు తమ విద్యా సంవత్సరంలో ఏ సమయంలో పరీక్షలు రాస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయో డేటా ఆధారిత వివరాలతో తెలిపారు.పదో తరగతి మధ్యలో నుంచి పరీక్షలకు సిద్ధం కావడం అత్యంత విజయవంతమైన ఫలితాలకు దారితీస్తుందని రీమా వివరించారు.తల్లిదండ్రులు, విద్యార్ధుల నుంచి వచ్చిన ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానాలు ఇచ్చారు.రిజిస్ట్రేషన్ సమయాలు, ఎన్నిసార్లు పరీక్ష రాయాలి, ప్రిపరేషన్ టైమ్లైన్, కోచింగ్ ఎంపికల గురించి వ్యక్తిగత సలహాలు రీమా ఇచ్చారు. "80/20 రూల్" వంటి ఆచరణాత్మక వ్యూహాలను వివరించారు.ఈ వెబినార్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కిరణ్ మందాడి ధన్యవాదాలు తెలిపారు. ఈ వెబినార్ను విజయవంతంగా నడిపించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







