లండన్లో ఘోర ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
- September 03, 2025
లండన్: లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన తర్రె చైతన్య, రిషితేజగా గుర్తించారు. లండన్లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి కారును వేరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ హైదరాబాద్లోని నాదర్గుల్, ఉప్పల్ ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







