లండన్లో ఘోర ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
- September 03, 2025
లండన్: లండన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన తర్రె చైతన్య, రిషితేజగా గుర్తించారు. లండన్లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి కారును వేరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ హైదరాబాద్లోని నాదర్గుల్, ఉప్పల్ ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









