పాలస్తీనియన్లను తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపును ఖండించిన GCC..!!
- September 06, 2025
రియాద్: పాలస్తీనియన్లను వారి భూమి నుండి తరిమికొట్టాలన్న ఇజ్రాయెల్ పిలుపులను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) తీవ్రంగా ఖండించింది. ఇది అన్ని అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి ఎవరు వెళ్లగొట్టలేరని, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి జారీ చేసిన బాధ్యతారహితమైన మరియు ప్రమాదకరమైన ప్రకటనలను GCC సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఒక ప్రకటనలో ఖండించారు. అంతర్జాతీయ సమాజం దీనిపై స్పందించాలని, అన్ని దేశాలు ఈ ప్రమాదకరమైన పద్ధతులు, ప్రకటనలను ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయమైన, సమగ్ర శాంతిని సాధించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దులలో స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించే అవకాశాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







