యూఏఈలో డ్రైవర్లెస్ కార్ల డెలివరీలు..!!
- September 09, 2025
యూఏఈ: అత్యాధునిక డ్రైవర్లెస్ టెక్నాలజీకి యూఏఈ కేంద్రంగా మారుతోంది. ప్రయాణికులను ట్రాన్స్ పోర్ట్ చేసేముందు ఆటోమెటిక్ టాక్సీల నుండి డ్రైవర్లు లేకుండా కస్టమర్లకు వస్తువులను తీసుకువచ్చే డెలివరీ వాహనాల వరకు ఉన్నాయి.
దుబాయ్ వాణిజ్యం, రవాణా మరియు లాజిస్టిక్స్ హోల్డింగ్ గ్రూప్ 7X ఈమేకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక సంవత్సరంలో యూఏఈ అంతటా స్వంతంగా వాహనాల ద్వారా డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తోస్తున్నట్టు దని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కంపెనీ ప్రస్తుతం అబుదాబిలోని మస్దార్ నగరంలో ఆటోమెటిక్ వాహనాల ట్రయల్స్ నిర్వహిస్తోంది. వినియోగదారులకు ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది.
“మస్దార్ నగరంలో ఇప్పటికే కొన్ని ఆటోమెటెడ్ ట్రక్కులు డెలివరీలు చేస్తున్నాయి. త్వరలోనే దీనిని ఖలీఫా సిటీకి విస్తరిస్తాము. ఆ తర్వాత దుబాయ్లో కూడా మరో ట్రయల్ నిర్వహిస్తాం. ఒక సంవత్సరంలో తాము ఆ వాహనాలను యూఏఈ అంతటా రోడ్లపై పెడతాము ”అని 7X గ్రూప్ CEO తారిక్ అల్ వహేది అన్నారు.
ఏప్రిల్లో యాంగో టెక్నాలజీ ఫుడ్, టెక్ సంస్థ రూట్స్ అండ్ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీతో భాగస్వామ్యంతో శోభా హార్ట్ల్యాండ్లో 30 నిమిషాల లోపు 22 కిలోమీటర్ల పరిధిలో ఆర్డర్లను డెలివరీ చేయనున్నారు.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









