టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- September 11, 2025
తిరుపతి: తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉదయం సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను సందర్శించి సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా టిటిడి ఈవోకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.
అంతకుముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు.
టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ.బాలాజీ, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ టి.వి.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







