సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- September 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని 51 నగరాలు మరియు గవర్నరేట్లలో 2,000 కంటే ఎక్కువ ఫీల్డ్ తనిఖీలను నిర్వహించినట్లు సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రేడ్మార్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 3.6 మిలియన్లకు పైగా ఉత్పత్తులను సీజ్ చేసిన్నట్టు తెలిపింది. అథారిటీ జారీ చేసిన 2024 వార్షిక మేధో సంపత్తి హక్కుల అమలు నివేదిక ప్రకారం, ఈ ఉల్లంఘనలలో దాదాపు 52 శాతం డ్రెసెస్, ఫుట్ వేర్ రంగంలో ఉన్నాయి.
వీటితోపాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో 330 అనుమానిత కస్టమ్స్ షిప్మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దాంతో 6.7 మిలియన్లకు పైగా ఫేక్ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
అద విధంగా డిజిటల్ రంగంలో 2024లో 7,900 వెబ్సైట్లు బ్లాక్ చేసినట్టు తెలిపింది. కాపీరైట్ రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన లైవ్ స్ట్రీమింగ్ సైట్లకు సంబంధించి 2023తో పోలిస్తే 128 శాతం పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొంది. కాపీరైట్ మరియు ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు సంబంధించిన 3,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







