సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- September 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని 51 నగరాలు మరియు గవర్నరేట్లలో 2,000 కంటే ఎక్కువ ఫీల్డ్ తనిఖీలను నిర్వహించినట్లు సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రేడ్మార్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 3.6 మిలియన్లకు పైగా ఉత్పత్తులను సీజ్ చేసిన్నట్టు తెలిపింది. అథారిటీ జారీ చేసిన 2024 వార్షిక మేధో సంపత్తి హక్కుల అమలు నివేదిక ప్రకారం, ఈ ఉల్లంఘనలలో దాదాపు 52 శాతం డ్రెసెస్, ఫుట్ వేర్ రంగంలో ఉన్నాయి.
వీటితోపాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో 330 అనుమానిత కస్టమ్స్ షిప్మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దాంతో 6.7 మిలియన్లకు పైగా ఫేక్ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
అద విధంగా డిజిటల్ రంగంలో 2024లో 7,900 వెబ్సైట్లు బ్లాక్ చేసినట్టు తెలిపింది. కాపీరైట్ రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన లైవ్ స్ట్రీమింగ్ సైట్లకు సంబంధించి 2023తో పోలిస్తే 128 శాతం పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొంది. కాపీరైట్ మరియు ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు సంబంధించిన 3,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







