సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- September 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని 51 నగరాలు మరియు గవర్నరేట్లలో 2,000 కంటే ఎక్కువ ఫీల్డ్ తనిఖీలను నిర్వహించినట్లు సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రేడ్మార్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 3.6 మిలియన్లకు పైగా ఉత్పత్తులను సీజ్ చేసిన్నట్టు తెలిపింది. అథారిటీ జారీ చేసిన 2024 వార్షిక మేధో సంపత్తి హక్కుల అమలు నివేదిక ప్రకారం, ఈ ఉల్లంఘనలలో దాదాపు 52 శాతం డ్రెసెస్, ఫుట్ వేర్ రంగంలో ఉన్నాయి.
వీటితోపాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో 330 అనుమానిత కస్టమ్స్ షిప్మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దాంతో 6.7 మిలియన్లకు పైగా ఫేక్ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
అద విధంగా డిజిటల్ రంగంలో 2024లో 7,900 వెబ్సైట్లు బ్లాక్ చేసినట్టు తెలిపింది. కాపీరైట్ రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన లైవ్ స్ట్రీమింగ్ సైట్లకు సంబంధించి 2023తో పోలిస్తే 128 శాతం పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొంది. కాపీరైట్ మరియు ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు సంబంధించిన 3,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









