కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!

- September 13, 2025 , by Maagulf
కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!

యూఏఈ: యూఏఈలో వర్క్ సైట్ లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం అందనుంది. ఈ మేరకు అబుదాబి కాసేషన్ కోర్టు తీర్పును వెలువరించింది. వర్క్ సైట్ లో భద్రతా పరమైన నిబంధనలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టు ఆక్షేపించింది. 

కాగా, ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి Dh10 మిలియన్ల పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యంపై సివిల్ కేసు వేశాడు.     కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.  తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 1.1 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

అయితే, ఈ తీర్పుపై సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు. దాంతో కేసును విచారించిన అబుదాబి కాసేషన్ కోర్టు పరిహార డబ్బును 1.5 మిలియన్ దిర్హామ్‌లకు పెంచుతూ సెప్టెంబర్ 10న తీర్పును వెలువరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com