కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!

- September 13, 2025 , by Maagulf
కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!

కువైట్: కువైట్ లోనూతన భారత రాయబారిగా పరమితా త్రిపాఠి నియమితులయ్యారు. 2001 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన ఆమె.. ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.  

2005 నుండి 2008 వరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలలో పనిచేశారు. టోక్యోలోని రాయబార కార్యాలయంలో 2008–2011వరకు వివిధ హోదాల్లో సేవలందించారు. 2013లో సింగపూర్‌లోని ఇండియన్ హైకమిషన్‌లో డిప్యూటీ హైకమిషనర్‌గా పనిచేశారు.

పరమితా త్రిపాఠి, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి జియోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.   

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com