కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- September 13, 2025
యూఏఈ: యూఏఈలో వర్క్ సైట్ లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం అందనుంది. ఈ మేరకు అబుదాబి కాసేషన్ కోర్టు తీర్పును వెలువరించింది. వర్క్ సైట్ లో భద్రతా పరమైన నిబంధనలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టు ఆక్షేపించింది.
కాగా, ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి Dh10 మిలియన్ల పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యంపై సివిల్ కేసు వేశాడు. కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 1.1 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
అయితే, ఈ తీర్పుపై సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు. దాంతో కేసును విచారించిన అబుదాబి కాసేషన్ కోర్టు పరిహార డబ్బును 1.5 మిలియన్ దిర్హామ్లకు పెంచుతూ సెప్టెంబర్ 10న తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









