కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- September 13, 2025
యూఏఈ: యూఏఈలో వర్క్ సైట్ లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం అందనుంది. ఈ మేరకు అబుదాబి కాసేషన్ కోర్టు తీర్పును వెలువరించింది. వర్క్ సైట్ లో భద్రతా పరమైన నిబంధనలు అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని కోర్టు ఆక్షేపించింది.
కాగా, ప్రమాదానికి గురైన కార్మికుడు తనకు జరిగిన నష్టానికి Dh10 మిలియన్ల పరిహారం కోరుతూ ముందుగా యాజమాన్యంపై సివిల్ కేసు వేశాడు. కేసును విచారించిన అబుదాబి ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు కార్మికుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 1.1 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
అయితే, ఈ తీర్పుపై సంతృప్తిగా లేని కార్మికుడు అప్పీల్ చేసుకున్నాడు. దాంతో కేసును విచారించిన అబుదాబి కాసేషన్ కోర్టు పరిహార డబ్బును 1.5 మిలియన్ దిర్హామ్లకు పెంచుతూ సెప్టెంబర్ 10న తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







