వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- September 15, 2025
న్యూ ఢిల్లీ: వక్ఫ్ చట్టం 2025లో చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, రికార్డుల సంరక్షణ, కొత్త నిబంధనల అమలు వంటి అంశాలపై పలువురు పిటిషనర్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులను సోమవారం ధర్మాసనం విచారించింది. చీఫ్ జస్టిస్ జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యవహారంలో మధ్యంతర తీర్పు ఇచ్చింది.
తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే – వక్ఫ్ చట్టం మొత్తాన్ని తక్షణమే నిలిపివేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి చట్టం సమగ్రంగా అమల్లోనే కొనసాగుతుంది. అయితే ఇటీవల సవరణలలో చేర్చిన కొన్ని నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా అమలు చేసే ముందు లోతైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ కారణంగా కొన్ని ప్రత్యేక నిబంధనలపై మాత్రమే తాత్కాలికంగా స్టే విధించింది.
కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని కోర్టు నిలిపివేసింది.దీర్ఘకాలంగా వక్ఫ్ కోసం ఉపయోగించిన ఆస్తులను, వాటిని వక్ఫ్గా ప్రకటించే నిబంధనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆస్తులను డీనోటిఫై (Denotify) చేయవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. దీని వల్ల చాలా వివాదాలు తలెత్తుతాయని, ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధానం తీసుకురావాలని సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!









