బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- September 17, 2025
యూఏఈః అబుదాబి బిగ్ టికెట్ సెప్టెంబర్లో జరిగిన మొదటి విక్లీ ఇ-డ్రాలో నలుగురు భారతీయులు, ఒక బంగ్లాదేశీ విజేతలుగా నిలిచారు. ప్రతి విజేత 50 వేల దిర్హమ్స్ పొందనున్నారు. విజేతలలో భారతీయులలో ఒకరైన బిజు జోస్ సెప్టెంబర్ 4న ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేశాడు. కేరళకు చెందిన 36 ఏళ్ల అబుదాబిలో పనిచేస్తున్న అభిలాష్ కుంజప్పి పది మంది సహోద్యోగులతో కొనుగోలు చేసిన టికెట్ విజయాన్ని తెచ్చిపెట్టింది.12 సంవత్సరాలుగా అబుదాబిలో నివసిస్తున్న కేరళకు చెందిన 34 ఏళ్ల ఎలక్ట్రీషియన్ జిబిన్ పీటర్ టూ ప్లస్ టూ టికెట్ కొనుగోలుతో వచ్చిన ఉచిత టికెట్ ద్వారా విజయాన్ని దక్కించుకున్నారు. గత 28 సంవత్సరాలుగా దుబాయ్లో నివసిస్తున్న బంగ్లాదేశ్ ప్రవాసి 53 ఏళ్ల ప్లాస్టరింగ్ వ్యాపారి మొహమ్మద్ మామునుర్ రెహ్మాన్ నాసర్ ఉల్లా విజేతగా నిలిచాడు.
ఇక అక్టోబర్ 3న లైవ్ డ్రా లో ఒక అదృష్టవంతుడు Dh20 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకుంటాడు. దాంతోపాటు నలుగురు కన్సోలేషన్ విజేతలకు ఒక్కొక్కరికి Dh50,000 దక్కనుంది. ఇక వీక్లీ డ్రాలు నెల పొడవునా కొనసాగుతాయి. రతి వారం నలుగురు విజేతలకు Dh50,000 అందజేయనున్నారు. బిగ్ టికెట్ స్టోర్లు సెప్టెంబర్ లో ప్రత్యేక టిక్కెట్ బండిల్ ప్రమోషన్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో 2 టిక్కెట్లు కొంటే బిగ్ టికెట్ ఎంట్రీలకు 2 ఉచితంగా లభిస్తాయి. ఇక డ్రీమ్ కార్ ఎంట్రీలకు 2 టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి 3 టికెట్లు ఉచితంగా లభించనున్నాయి
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం