కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- September 17, 2025
కువైట్ః కువైట్ లో 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాల మేరకు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలు లేకుండా స్కూళ్లకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కఠినంగా వ్యవహారించాలని సూచించారు. స్కూల్ సమయాలలో సిబ్బంది పర్యవేక్షణను పెంచాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ట్రాఫిక్ అధికారులతో పూర్తిగా సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









