కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- September 17, 2025
కువైట్ః కువైట్ లో 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాల మేరకు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలు లేకుండా స్కూళ్లకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కఠినంగా వ్యవహారించాలని సూచించారు. స్కూల్ సమయాలలో సిబ్బంది పర్యవేక్షణను పెంచాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ట్రాఫిక్ అధికారులతో పూర్తిగా సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!