కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- September 17, 2025
కువైట్ః కువైట్ లో 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాల మేరకు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ ట్రాఫిక్ సమస్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలు లేకుండా స్కూళ్లకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కఠినంగా వ్యవహారించాలని సూచించారు. స్కూల్ సమయాలలో సిబ్బంది పర్యవేక్షణను పెంచాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ట్రాఫిక్ అధికారులతో పూర్తిగా సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







