దోహా లో మొండికేస్తున్న ఎయిర్ కండిషనర్లు..వెల్లువెత్తుతున్న మరమ్మతులు
- July 20, 2016
దోహా లో ఈ వేసవి అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎయిర్ కండిషనర్లు మరమ్మత్తు మరియు నిర్వహణ సేవా కేంద్రాల వద్ద బుకింగ్స్ ఉన్నట్లుండి అమాంతంగా నమోదు కాబడినట్లు తెలిసింది.బుకింగ్స్ సాధారణంగా సంవత్సరంలో ఇతర నెలల పోలిస్తే వేసవిలో 50 శాతం పెరుగుతుందని ఒక ప్రముఖ దక్షిణ కొరియా బ్రాండ్ ఆధరైజ్డ్ సేవాకేంద్రం ఒక టెక్నీషియన్ గా పనిచేసే ఫెర్నాం .చెప్పారు. ఎయిర్ కండిషనర్ల యొక్క సాధారణ భాగాలైన కంప్రెసర్, కెపాసిటర్, మరియు కంప్రెసర్ యొక్క అంత్య క్లిప్ ప్రస్తుత వేడి వాతావరణంలో దెబ్బ తింటున్నట్లు ఆరోపిస్తున్నారు ఎయిర్ కండిషనర్ల యొక్క సాధారణ భాగాలని రెగ్యులర్ నిర్వహణతో జీవితకాలం కొనసాగింపు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఎయిర్ కండిషనర్లు ఉపయోగిస్తారు. విపరీతమైన వేడి కారణంగా బాహ్య యూనిట్లు ఎక్కువగా నష్టం వాటిల్లడంతో బాధపడుతున్నారని వివరించారు. ఎయిర్ కండిషనర్ల యజమానులు వేసవి ప్రారంభానికి ముందే కంప్రెసర్ ఎక్కువగా పని చేయడం దృష్ట్యా మందు వేసవిలో మొరాయించడం నివారించేందుకు "నివారణ నిర్వహణ" కోసం నిపుణుని వద్దకు తీసుకుపోవాలని అన్నారు. ఈ మరమ్మతు కోసం సేవాకేంద్రం సేవలని పొందేందుకు ముందే సంప్రదించాలనితద్వారా వేసవి కాలం తలెత్తే అవాంతరం తొలగిస్తుందని ఫెర్నాం తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









