'తొలికిరణం' చిత్రం
- July 20, 2016
పి.డి.రాజు ఏసుక్రీస్తుగా జె.జానబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'తొలికిరణం'. అభినయ మేరీమాతగా నటించగా భానుచందర్, సాయికిరణ్, సురేఖావాణి కీలక పాత్రలు పోషించారు. టి. సుధాకర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తైంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఏసుక్రీస్తూ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన క్రీస్తూ చిత్రాల్లో లేని కొత్త అంశాల్ని ఇందులో చూపిస్తున్నాం. ఆయన సమాధి అయ్యి తిరిగొచ్చిన తర్వాత మానవాళికి ఎటువంటి సందేశాలిచ్చారు అన్నది ఈ చిత్రంలో కీలకం. ఇజ్రాయిల్, జెరుసలెం వంటి ప్రాంతాల్లో క్రీస్తూకి సంబంధించిన ఆధారాలను సేకరించి చిత్రాన్ని తెరకెక్కించాను. చాలా ఏళ్ల తర్వాత ఎస్.పి.బాలుగారు క్రీస్తు సినిమాకి ఓ పాట పాడారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం ఆనందం కలిగించింది. ఆగస్ట్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేసి, క్రిస్మ్సకి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







