ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!

- September 22, 2025 , by Maagulf
ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!

మనామా: సూట్‌కేసులో మాదకద్రవ్యాలను దాచి బహ్రెయిన్‌లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా జాతీయులపై విచారణను హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. నిందితుల వాదనలు వినడానికి  తదుపరి సెషన్‌ను సెప్టెంబర్ 22కి కోర్టు వాయిదా వేసింది.

ఓ ఆసియా దేశం నుండి మాదకద్రవ్యాలుగా అనుమానించబడిన మూలికా పదార్థాన్ని కలిగి ఉన్న సూట్‌కేస్‌తో వస్తున్నట్లు కస్టమ్స్ శాఖకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే వారిని తనిఖీ చేయగా..ఆ పదార్థం గంజాయి అని తేలిందన్నారు. మొత్తం ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com