ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- September 22, 2025
మనామా: సూట్కేసులో మాదకద్రవ్యాలను దాచి బహ్రెయిన్లోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆసియా జాతీయులపై విచారణను హై క్రిమినల్ కోర్టు ప్రారంభించింది. నిందితుల వాదనలు వినడానికి తదుపరి సెషన్ను సెప్టెంబర్ 22కి కోర్టు వాయిదా వేసింది.
ఓ ఆసియా దేశం నుండి మాదకద్రవ్యాలుగా అనుమానించబడిన మూలికా పదార్థాన్ని కలిగి ఉన్న సూట్కేస్తో వస్తున్నట్లు కస్టమ్స్ శాఖకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే వారిని తనిఖీ చేయగా..ఆ పదార్థం గంజాయి అని తేలిందన్నారు. మొత్తం ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







