తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- September 22, 2025
తెలంగాణ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది.
దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్ మధ్య కూడా వందేభారత్ రైలును పట్టాలు ఎక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది.
ప్రస్తుతం ఉన్న వందేభారత్ సర్వీసులు ఇవే
హైదరాబాద్ నుంచి విశాఖకు 2
హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, నాగపూర్కు ఒక్కోటి చొప్పున
ఈ మార్గాల మధ్య ప్రయాణికులు అధికం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్-నాందేడ్ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
నాందేడ్లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్-నాందేడ్ మార్గంలో నిజామాబాద్ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు కూడా చాలా మంది వెళ్తుంటారు.
కొత్తగా హైదరాబాద్-పుణె మధ్య కూడా వందేభారత్ రైలు మంజూరైంది. ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణికుల రాకపోకలు కూడా బాగా ఉంటాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం