30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- September 26, 2025
హైదరాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇగ్నో ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ హాజరుకానున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు
స్నాతకోత్సవ వివరాలను ఆయన గురువారం యూనివర్సిటీ క్యాంపస్లో మీడియా సమావేశంలో వివరించారు. ప్రజా కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమావత్లకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నట్టు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీలో 35, పీజీలో 51 బంగారు పతకాలు, ఇద్దరు ఖైదీలకు బంగారు పతకాలను ఇవ్వనున్నట్టు చెప్పారు.
గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు ఎం.ఫిల్, పిహెచ్.డి పట్టాలు, ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకాలు, బుక్ ప్రైజులు అందించనున్నట్లు వివరించారు.
26వ స్నాతకోత్సవంలో 60,288 మంది అభ్యర్థులు తమ డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికెట్లు పొందనున్నారు. ఇందులో అండర్గ్రాడ్యుయేట్లో 35,346 మంది, పోస్ట్గ్రాడ్యుయేట్లో 24,942 మంది సర్టిఫికెట్లు అందుకోనున్నారు. అదేవిధంగా, వివిధ జైళ్లలో విద్యాభ్యసించిన 203 మంది ఖైదీ అభ్యర్థులు కూడా డిగ్రీలు, పట్టాలు పొందనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









