సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- September 26, 2025
మనామా: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల టీనేజర్ ను బహ్రెయిన్ సైబర్ క్రైం టీమ్ అదుపులోకి తీసుకుంది.ఓ కుటుంబం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ ఒక వ్యక్తిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, ముఖ్యంగా వికలాంగులను టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. టినేజర్ ఫోన్ సీజ్ చేసి, వాటిని ఆరోపనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు వివరించారు.
పిల్లల ఆన్లైన్ సంభాషణలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెట్టాలని ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ హెడ్ సూచించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలు పంచుకునే కంటెంట్ను పర్యవేక్షించాలని కోరారు. ప్రచురణ మరియు ఆన్లైన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెనుకాడదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









