సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- September 26, 2025
మనామా: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల టీనేజర్ ను బహ్రెయిన్ సైబర్ క్రైం టీమ్ అదుపులోకి తీసుకుంది.ఓ కుటుంబం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ ఒక వ్యక్తిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, ముఖ్యంగా వికలాంగులను టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు. టినేజర్ ఫోన్ సీజ్ చేసి, వాటిని ఆరోపనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు వివరించారు.
పిల్లల ఆన్లైన్ సంభాషణలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెట్టాలని ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ హెడ్ సూచించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలు పంచుకునే కంటెంట్ను పర్యవేక్షించాలని కోరారు. ప్రచురణ మరియు ఆన్లైన్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెనుకాడదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







