యుఎఇ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాది బాలుడి మృతి 23 మందికి గాయాలు

- July 20, 2016 , by Maagulf
యుఎఇ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాది బాలుడి మృతి 23 మందికి గాయాలు

          

 మస్క్యాట్: యుఎఇ లో  బుధవారం ఉదయం జరిగిన  ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఏడాది వయస్సు ఉన్న ఒక  బాలుడి మృతి చెందగా  మరో  23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇరాన్ నుంచి పర్యటన ముగించుకున్న  మొత్తం 24 మంది  ప్రయాణికుల  షార్జ విమానాశ్రయం నుంచి బస్సులో  ఒమాన్ కు తిరిగి ప్రయాణించే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కల్బా యొక్క వాడి అల్ హలో  యొక్క మాడీక్  స్ట్రీట్ లో ఉదయం 6.50 సమయంలో బస్సు ఒక ఆకస్మిక మలుపు వద్ద తిరుగుతూ ప్రమాదానికి గురయ్యాయంది. అగ్ని రాజుకొని బస్సుని చుట్టుముట్టింది.
అబూధాబీలో ఉన్న ఒమన్ ఎంబసీ తెలిపిన వివరాల  ప్రకారం ఈ ప్రమాదంలో కల్బా హాస్పిటల్ లో ఉన్న ముగ్గురు ఓమానీయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  ఇద్దరు పిల్లలకు కాళ్లు చేతులు విరిగిపోయాయి. అలాగే ఒక మహిళ 35 శాతం పై కాలిన శరీర గాయాలతో బాధపడుతుంది. ఒమాని ఎంబసీ వద్ద ఒక అధికారిక ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏడాది పిల్లవాడి మృతదేహాన్నిసోమవారం స్వదేశానికి పంపించబడుతున్నట్లు" మా గల్ఫ్ డాట్ కామ్ " కు  ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో  మరణించినబాలుడు బస్సు డ్రైవర్ యొక్క కుమారుడని తెలిపారు. దక్షిణ బతినః గవర్నరేట్ లో  ప్రయాణికులు ఇరాన్ లో సెలవలు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com