యుఎఇ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాది బాలుడి మృతి 23 మందికి గాయాలు
- July 20, 2016
మస్క్యాట్: యుఎఇ లో బుధవారం ఉదయం జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ఏడాది వయస్సు ఉన్న ఒక బాలుడి మృతి చెందగా మరో 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇరాన్ నుంచి పర్యటన ముగించుకున్న మొత్తం 24 మంది ప్రయాణికుల షార్జ విమానాశ్రయం నుంచి బస్సులో ఒమాన్ కు తిరిగి ప్రయాణించే సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కల్బా యొక్క వాడి అల్ హలో యొక్క మాడీక్ స్ట్రీట్ లో ఉదయం 6.50 సమయంలో బస్సు ఒక ఆకస్మిక మలుపు వద్ద తిరుగుతూ ప్రమాదానికి గురయ్యాయంది. అగ్ని రాజుకొని బస్సుని చుట్టుముట్టింది.
అబూధాబీలో ఉన్న ఒమన్ ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కల్బా హాస్పిటల్ లో ఉన్న ముగ్గురు ఓమానీయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరు పిల్లలకు కాళ్లు చేతులు విరిగిపోయాయి. అలాగే ఒక మహిళ 35 శాతం పై కాలిన శరీర గాయాలతో బాధపడుతుంది. ఒమాని ఎంబసీ వద్ద ఒక అధికారిక ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఏడాది పిల్లవాడి మృతదేహాన్నిసోమవారం స్వదేశానికి పంపించబడుతున్నట్లు" మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినబాలుడు బస్సు డ్రైవర్ యొక్క కుమారుడని తెలిపారు. దక్షిణ బతినః గవర్నరేట్ లో ప్రయాణికులు ఇరాన్ లో సెలవలు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







