ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- September 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల్లో భాగంగా, తొలిసారిగా ఎయిర్ బస్ సంస్థ తమ బోర్డు సమావేశాన్ని భారత్లో నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, ఏపీని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. ఎయిర్ బస్ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, విమాన రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భూములు, కారిడార్లు అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
లోకేశ్ మాట్లాడుతూ, ప్రోగ్రెసివ్ ఏరోస్పేస్ పాలసీ, ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు, మల్టిపుల్ కారిడార్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులతో రాష్ట్రం సంపన్నంగా ఉందని వివరించారు. ఇకపోతే, అనుమతుల విషయంలో సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వేగవంతమైన సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను వివరించారు.
ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీతో భాగస్వామ్యం ఎయిర్ బస్కు మేలే అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ బస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









