ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- October 04, 2025
మనామా: ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్బంధించిన బహ్రెయిన్, కువైట్ పౌరుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని విడిపించేందుకు కువైట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. బందీలు సురక్షితంగా తమ దేశాలకు వచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన మరియు దౌత్య పరమైన ప్రోటోకాల్లను పూర్తిగా గౌరవిస్తూ, తమ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి బహ్రెయిన్, కువైట్ కట్టుబడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!







