ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- October 04, 2025
మనామా: ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్బంధించిన బహ్రెయిన్, కువైట్ పౌరుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని విడిపించేందుకు కువైట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. బందీలు సురక్షితంగా తమ దేశాలకు వచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన మరియు దౌత్య పరమైన ప్రోటోకాల్లను పూర్తిగా గౌరవిస్తూ, తమ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి బహ్రెయిన్, కువైట్ కట్టుబడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







