ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- October 04, 2025
మనామా: ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్బంధించిన బహ్రెయిన్, కువైట్ పౌరుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని విడిపించేందుకు కువైట్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. బందీలు సురక్షితంగా తమ దేశాలకు వచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన మరియు దౌత్య పరమైన ప్రోటోకాల్లను పూర్తిగా గౌరవిస్తూ, తమ పౌరులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి బహ్రెయిన్, కువైట్ కట్టుబడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







