200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!

- October 05, 2025 , by Maagulf
200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!

యూఏఈః 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గోల్డెన్ వీసాలు మంజూరు చేశారు. ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు మన పిల్లలకు స్ఫూర్తినిస్తారని, మార్గనిర్దేశం చేస్తారని, వారు విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు,  విశ్వాసాన్ని ఇస్తారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో షేక్ హమ్దాన్ అన్నారు.
అక్టోబర్ 5న ప్రపంచ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న 435 మంది ఉపాధ్యాయులలో, 223 మంది విద్యావేత్తలకు గోల్డెన్ వీసా లభించిందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15న రెండవ రౌండ్ గోల్డెన్ వీసాల కోసం దరఖాస్తులు ప్రారంభం అవుతాయని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com