కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- October 05, 2025
కువైట్: కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై అమల్లో ఉన్న నిషేధాన్ని కువైట్ ఎత్తివేసింది. స్థానికంగా ముల్లెట్ ఫిష్ ల సరఫరాను పెంచడం మరియు వాటి ధరలను తగ్గించడం లక్ష్యంగా కువైట్ బే లోపల ముల్లెట్ చేపలు పట్టడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ (PAAAFR) అనుమతిని మంజూరు చేసింది. ఇప్పుడు మత్స్యకారులు అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు కాలానుగుణ నిషేధం అమలులోకి వచ్చే వరకు బేలో ముల్లెట్ లను పట్టుకోవచ్చని అధికారులు తెలిపారు.
కువైట్ బే లోపల చేపలు పట్టడంపై గత 20 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కువైట్ జాలర్ల సంఘం పదేపదే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బేలో ఏడాది పొడవునా చేపలు పట్టడానికి అనుమతిస్తే ముల్లెట్ ధరలు మరింత తగ్గుతాయని యూనియన్ చైర్మన్ అబ్దుల్లా అల్-సర్హీద్ తెలిపారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు కువైట్ ఆర్థిక జలాల్లో తీరం నుండి 12 మైళ్ల దూరంలో ఉన్న ముల్లెట్ను మాత్రమే మత్స్యకారులు పట్టుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









