అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- October 06, 2025
అమెరికా: అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలుగు యువకుల వరుస మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.డల్లాస్ లో దుండగుడి కాల్పుల్లో మీర్పేటకు చెందిన పోలే చంద్రశేఖర్ మరణించిన వార్త తెలిసి 48 గంటలు గడవక ముందే, మరో హైదరాబాదీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో 48 గంటల్లో రెండోసారి హైదరాబాద్ విద్యార్థి మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ అనే విద్యార్థి అక్టోబర్ 5వ తేదీ (ఆదివారం) నాడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. షెరాజ్ చంచల్గూడ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవలే అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.
ఇదే 48 గంటల్లో జరిగిన రెండో మృతి. అంతకు ముందు రోజు మరో హైదరాబాద్ విద్యార్థి 28 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ పోలే టెక్సాస్లోని డల్లాస్లో కాల్పుల్లో మృతిచెందాడు. బీఎన్ నగర్కు చెందిన చంద్రశేఖర్ డల్లాస్లోని గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్ పనిచేస్తూ తన ఖర్చులు నెట్టుకొచ్చేవాడు.
శనివారం తెల్లవారుజామున దొంగల దాడిలో ఆయన కాల్పులకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రశేఖర్ డెంటల్ సర్జరీలో పట్టా సాధించాడు. 2023 ఆగస్టు 21 నుంచి డెంటన్లోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో డేటా అనలిటిక్స్లో
మాస్టర్స్ చదువుతున్నాడు.చంద్రశేఖర్ మరణం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ సహాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







