విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- October 06, 2025
విశాఖపట్నం: భారత మహిళా క్రికెటర్లను గుర్తించాలని స్మృతి మంధాన చేసిన హృదయపూర్వక సూచన వాస్తవ రూపం దాల్చనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
2025 అక్టోబర్ 12న స్టాండ్లకు మిథాలీ రాజ్, రవి కల్పనల పేర్లు పెట్టనున్నారు. ఆ రోజు మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వైజాగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు స్టాండ్లకు పేర్లు పెట్టనున్నారు.
ఆగస్టు 2025లో `బ్రేకింగ్ బౌండరీస్` కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్తో పాటు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పాల్గొన్నారు. ఈ సందర్భంలో.. విశాఖపట్నంతో పాటు వివిధ వేదికల్లో పురుషుల దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టాండ్స్ ఉన్నాయని, భారత మహిళా దిగ్గజ క్రికెటర్లతో పేర్లతో స్టాండ్స్ లేవనే విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి స్మృతి మంధాన తీసుకువచ్చారు. స్టాండ్లకు మహిళా క్రికెటర్ల పేర్లను పెట్టడం వల్ల వారు క్రికెట్ కు చేసిన కృషిని గౌరవించినట్లు అవుతుందని, అదే సమయంలో యువ మహిళా ప్లేయర్లకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
మంధాన విజ్ఞప్తి పై మంత్రి లోకేష్..ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను సంప్రదించారు.ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు ఆంధ్రలో జన్మించి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రవి కల్పనల పేర్లను పెట్టాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీర్మానించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









