బంగారం ధరలు రికార్డ్-హై..!!
- October 07, 2025
యూఏఈ: షార్జా ఎక్స్ పోలో వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో.. విజిటర్స్, డీలర్లు మరియు రిటైలర్లను ఆకర్షిస్తుంది. బ్రాండ్ లను పెంచుకోవడానికి, క్లయింట్లతో కనెక్ట్ అవ్వడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండటంతో యూఏఈ, ఇతర GCC దేశాలలోని కొందరు నివాసితులు తమ నగదును బంగారంలోకి తరలిస్తున్నారు.
ద్రవ్యోల్బణం తమ నగదు నిల్వల విలువను తగ్గిస్తుందనే ఆందోళనలతో యూఏఈలోని వ్యాపారులు తమ పొదుపులను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయని, ప్రజలు దీనిని సురక్షితమైన మరియు పెట్టుబడిగా చూస్తారని అల్ రోమైజాన్ మార్కెటింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ధైబాన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ పొదుపులను నగదు రూపంలో ఉంచుకోవడం కంటే, విలువ కోల్పోయే అవకాశం ఉన్నందున, వారు బంగారం, ఇతర ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారని తెలిపారు.
కొంతమంది ఆర్థికవేత్తలు బంగారం ధర ఔన్సుకు $5,000కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజలు ఇప్పుడే బంగారం కొనడం మంచిదని భావిస్తున్నారు. యూఏఈ, సౌదీఅ అరేబియా అంతటా బంగారానికి అధిక డిమాండ్ ఉందని స్కోప్ మార్కెట్స్ సీఈఓ పావెల్ స్పిరిన్ పేర్కొన్నారు.
యూఏఈలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 24K బంగారం ధర గ్రాముకు Dh475.25, 22K బంగారం ధర గ్రాముకు Dh440 వద్ద ఉంది. బంగారం ధరలు ఏటా 5 నుండి 7 శాతం వరకు పెరిగేవి. కానీ ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి నుండి భారీగా పెరుగుతుందని పలువురు బంగారం వ్యాపారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









