బంగారం ధరలు రికార్డ్-హై..!!
- October 07, 2025
యూఏఈ: షార్జా ఎక్స్ పోలో వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో.. విజిటర్స్, డీలర్లు మరియు రిటైలర్లను ఆకర్షిస్తుంది. బ్రాండ్ లను పెంచుకోవడానికి, క్లయింట్లతో కనెక్ట్ అవ్వడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉండటంతో యూఏఈ, ఇతర GCC దేశాలలోని కొందరు నివాసితులు తమ నగదును బంగారంలోకి తరలిస్తున్నారు.
ద్రవ్యోల్బణం తమ నగదు నిల్వల విలువను తగ్గిస్తుందనే ఆందోళనలతో యూఏఈలోని వ్యాపారులు తమ పొదుపులను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయని, ప్రజలు దీనిని సురక్షితమైన మరియు పెట్టుబడిగా చూస్తారని అల్ రోమైజాన్ మార్కెటింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ధైబాన్ తెలిపారు. ఇన్వెస్టర్లు తమ పొదుపులను నగదు రూపంలో ఉంచుకోవడం కంటే, విలువ కోల్పోయే అవకాశం ఉన్నందున, వారు బంగారం, ఇతర ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారని తెలిపారు.
కొంతమంది ఆర్థికవేత్తలు బంగారం ధర ఔన్సుకు $5,000కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ప్రజలు ఇప్పుడే బంగారం కొనడం మంచిదని భావిస్తున్నారు. యూఏఈ, సౌదీఅ అరేబియా అంతటా బంగారానికి అధిక డిమాండ్ ఉందని స్కోప్ మార్కెట్స్ సీఈఓ పావెల్ స్పిరిన్ పేర్కొన్నారు.
యూఏఈలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 24K బంగారం ధర గ్రాముకు Dh475.25, 22K బంగారం ధర గ్రాముకు Dh440 వద్ద ఉంది. బంగారం ధరలు ఏటా 5 నుండి 7 శాతం వరకు పెరిగేవి. కానీ ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి నుండి భారీగా పెరుగుతుందని పలువురు బంగారం వ్యాపారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!







