కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- October 07, 2025
దోహా: ఖతార్ లోని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ తన తాజా ఆన్లైన్ వేలం వివరాలను ప్రకటించింది. ఈ పబ్లిక్ వేలాన్ని “మజాద్ అల్ జోమ్రోక్” యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 14–15వ లేదీల్లో వేలం జరుగుతుందన్నారు. వేలంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, పురాతన సేకరణలు మరియు కంటైనర్లతో సహా 160 కంటే ఎక్కువ రకాల వస్తువులు ఉంటాయని పేర్కొంది. ఇవి కొనుగోలుదారులకు విభిన్నమైన ప్రత్యేకమైన, విలువైన వస్తువులను అందిస్తాయని తెలిపింది.
ఆసక్తిగల పాల్గొనేవారు యాప్ ద్వారా లేదా నిర్దేశిత సమయాల్లో కస్టమ్స్ వేర్హౌస్ (ఇండస్ట్రియల్ ఏరియా)ని సందర్శించడం ద్వారా వస్తువులను ముందుగానే ప్రివ్యూ చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ 5 నుండి 15వరకు ఉదయం 8 నుండి 11 గంటల మధ్య వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..







