కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- October 07, 2025
దోహా: ఖతార్ లోని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ తన తాజా ఆన్లైన్ వేలం వివరాలను ప్రకటించింది. ఈ పబ్లిక్ వేలాన్ని “మజాద్ అల్ జోమ్రోక్” యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 14–15వ లేదీల్లో వేలం జరుగుతుందన్నారు. వేలంలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, పురాతన సేకరణలు మరియు కంటైనర్లతో సహా 160 కంటే ఎక్కువ రకాల వస్తువులు ఉంటాయని పేర్కొంది. ఇవి కొనుగోలుదారులకు విభిన్నమైన ప్రత్యేకమైన, విలువైన వస్తువులను అందిస్తాయని తెలిపింది.
ఆసక్తిగల పాల్గొనేవారు యాప్ ద్వారా లేదా నిర్దేశిత సమయాల్లో కస్టమ్స్ వేర్హౌస్ (ఇండస్ట్రియల్ ఏరియా)ని సందర్శించడం ద్వారా వస్తువులను ముందుగానే ప్రివ్యూ చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ 5 నుండి 15వరకు ఉదయం 8 నుండి 11 గంటల మధ్య వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









