బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- October 08, 2025
అమరావతి: ఏపీకి చెందిన కోనసీమ జిల్లాలోని రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటలలో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిని అంబపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో సుమారు 40 మంది కార్మికులు కేంద్రంలో విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలి, గోడ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనను రామచంద్రపురం ఆర్డీవో పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించినట్టు, ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సాయం అందించమని సూచించారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







