బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- October 08, 2025
అమరావతి: ఏపీకి చెందిన కోనసీమ జిల్లాలోని రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటలలో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిని అంబపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో సుమారు 40 మంది కార్మికులు కేంద్రంలో విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలి, గోడ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనను రామచంద్రపురం ఆర్డీవో పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించినట్టు, ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సాయం అందించమని సూచించారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







