బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- October 08, 2025
అమరావతి: ఏపీకి చెందిన కోనసీమ జిల్లాలోని రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మంటలలో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వారిని అంబపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సమయంలో సుమారు 40 మంది కార్మికులు కేంద్రంలో విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు గోడ కుప్పకూలి, గోడ శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనను రామచంద్రపురం ఆర్డీవో పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించినట్టు, ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించమని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సాయం అందించమని సూచించారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







