నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- October 09, 2025
స్టాక్ హోమ్: సౌదీ అరేబియాకు చెందిన సైంటిస్ట్ ఒమర్ యాఘి.. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. మరో ఇద్దరు సైంటిస్టులు సుసుము కిటగావా మరియు రిచర్డ్ రాబ్సన్లతో కలిసి అవార్డును అందుకోనున్నారు. మెటర్-ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి కోసం వీరు కృషి చేశారని, వారి పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితానికి దోహదం చేశాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. జోర్డాన్లో పాలస్తీనా తల్లిదండ్రులకు జన్మించిన యాఘికి 2021లో సౌదీ పౌరసత్వం లభించింది.
1901లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభమైంది. మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($1.2 మిలియన్లు) బహుమతిని అవార్డుతోపాటు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాతో స్థాపించబడిన నోబెల్ బహుమతులు.. సైన్స్, సాహిత్యం మరియు శాంతిలో అత్యుత్తమ విజయాలను సాధించిన వారిని గుర్తించి అందజేస్తారు. స్వయంగా రసాయన శాస్త్రవేత్త అయిన నోబెల్.. డైనమైట్ ఆవిష్కరణ నుండి వచ్చిన తన సంపదను ఒక శతాబ్దం క్రితం అవార్డులను స్థాపించడానికి ఉపయోగించాడు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









