కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- October 09, 2025
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించాలని కువైట్ నిర్ణయించింది. ఇకపై యూ-టర్న్ లు మరియు హైవే ఎగ్జిట్ ల వద్ద ఓవర్టేక్ చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులకు భారీగా జరిమానాలు విధిస్తామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను హెచ్చరించింది.
ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు KD 15 మరియు KD 20 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. రెండోసారి నేరాలకు పాల్పడిన వాహనాలను రెండు నెలల వరకు స్వాధీనం చేసుకుంటామని , ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు అధికారం కల్పించినట్లు వెల్లడించింది. మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు తరలిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







