కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- October 09, 2025
కువైట్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించాలని కువైట్ నిర్ణయించింది. ఇకపై యూ-టర్న్ లు మరియు హైవే ఎగ్జిట్ ల వద్ద ఓవర్టేక్ చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులకు భారీగా జరిమానాలు విధిస్తామని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను హెచ్చరించింది.
ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలకు KD 15 మరియు KD 20 మధ్య జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. రెండోసారి నేరాలకు పాల్పడిన వాహనాలను రెండు నెలల వరకు స్వాధీనం చేసుకుంటామని , ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు అధికారం కల్పించినట్లు వెల్లడించింది. మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడే డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యల కోసం కోర్టుకు తరలిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







