అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- October 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రతి ఒక్కదాంట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. హోంమంత్రి వివరించిన ప్రకారం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.
అలాగే సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. అదనంగా, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని కూడా అండగా నిలపాలని సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అనిత స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామని కూడా తెలిపారు
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









