అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- October 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ, తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రతి ఒక్కదాంట్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమాచారం కోసం ఈ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. హోంమంత్రి వివరించిన ప్రకారం, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు.
అలాగే సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. అదనంగా, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బందిని కూడా అండగా నిలపాలని సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అనిత స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామని కూడా తెలిపారు
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







