ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- October 27, 2025
సమైల్: అల్ దఖిలియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లో ఉన్న సమైల్ కోట ఇకపై ప్రధానమైన పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ మేరకు రావాఫిద్ సమైల్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లను తెలియజేసేలా, కోటను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. విదేశాల నుండి సందర్శకులను ఆకర్షించడంతోపాటు హెరిటేజ్ ప్రదేశాల నిర్వహణలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని హైలైట్ చేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుందన్నారు. ఒమాన్ పర్యాటక మ్యాపులో కీలకమైన సాంస్కృతిక గమ్యస్థానంగా సమైల్ విలాయత్ స్థానాన్ని పెంచుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









