బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- October 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని హమాలాలోని బ్లాక్ 1012లోని నివాసితుల పోరాటం ఫలించింది. వారి ఇళ్లకు పైపుల ద్వారా నీటిని అనుసంధానించే ప్రణాళికను పార్లమెంటు నిన్న అత్యవసరంగా ఆమోదించింది. పిల్లలు మరియు వృద్ధులు ఉన్న ఇళ్లకు ప్రాధాన్యతనిస్తూ వీలైనంత త్వరగా బ్లాక్ను మెయిన్లకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అక్కడ ఉండే నివాసితులకు పబ్లిక్ వాటర్ సదుపాయం లేదు. అయితే ఒక కిలోమీటరు దూరంలో వాటర్, పవర్, మురుగునీటి వ్యవస్థలు ఉన్నాయి. దాంతో అక్కడి నివాసితులు వాటర్ కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించేవారు. దానికి వారు ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి వచ్చేది.
వీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎంపీలు డాక్టర్ మునీర్ సెరూర్, ఖలీద్ బువానాక్, లుల్వా అల్ రుమైహి, జలాల్ కధేమ్ మరియు మొహమ్మద్ అల్ అహ్మద్ పార్లమెంట్ లో ప్రస్తావించడంతోపాటు, వారి ఇళ్లకు అత్యవసరంగా నీటి సరఫరా చేయాలని కోరారు. దీంతో స్పందించిన పార్లమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఆయా ఇళ్లను వాటర్ నెట్ వర్క్ కు అనుసంధానించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







