తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- October 30, 2025
తిరుమల: శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.
అనంతరం నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసులు అందించిన ఉపదేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజన చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







