తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- October 30, 2025
తిరుమల: శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.
అనంతరం నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసులు అందించిన ఉపదేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజన చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









