నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం
- October 31, 2025
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంపై ప్రభావం చూపుతున్న ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ కింద పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సమస్యతో పాటు ఆశా వర్కర్ల సమ్మె కూడా ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. 20 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా ప్రతినిధులతో అధికారులు నిన్న భేటీ అయ్యారు. సమ్మెను విరమించాలని అధికారులు విజ్ఞప్తి చేయగా, తమ డిమాండ్లపై ఈరోజు (మంగళవారం) నిర్ణయం వెల్లడిస్తామని వారు తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే ₹250 కోట్లను విడుదల చేసి, పెండింగ్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఆశా వర్కర్లు సమ్మె విరమించలేదు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను సాధ్యమైనంత వరకు వన్టైం సెటిల్మెంట్ చేయడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం







