'మైసా' మొదలయ్యింది..
- November 03, 2025
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కానుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టింది రష్మిక. అదే మైసా. ఈ సినిమాలో గోండ్ గిరిజన మహిళగా కనిపించనుంది. దీనికి సంబందించిన పోస్టర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్.(Mysaa) మొహానికి రక్తంతో చేతిలో బల్లెం పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక పోస్టర్ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.
ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్. కేరళలోని అథిరప్పిల్లీలో ఈ షూటింగ్ మొదలయ్యింది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రవీంద్ర పుల్లే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వనున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండు ఒకే టైంలో పూర్తి చేసి అతి త్వరగా సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు తన అద్భుతమైన మ్యూజిక్ తో ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్న జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక పుష్ప 2లో విలన్ గా నటించిన తారక్ ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!







