దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- January 10, 2026
దుబాయ్: విల్లా ఫైనాన్సింగ్ స్కామ్ కేసుకు సంబంధించి దుబాయ్ కోర్టు ముగ్గురు అరబ్ వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ స్కామ్ ద్వారా వారు మోసం చేసిన బాధిత ఫ్యామిలీకి Dh900,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. నిందితులు ఒక ప్రసిద్ధ ఆస్తి డెవలపర్ ప్రతినిధులుగా నటించి, బాధితులను విల్లా ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టమని ఒప్పించి, వారు సృష్టించిన నకిలీ కంపెనీ ద్వారా తనఖా ఫైనాన్సింగ్కు హామీ ఇచ్చారని కోర్టు తెలిపింది.
కోర్టు రికార్డుల ప్రకారం.. బాధిత ఫ్యామిలీ సోషల్ మీడియాలో మార్టిగేజ్ ఫండింగ్ అందించే ప్రకటనను చూసారు. కంపెనీ సేల్స్ మేనేజర్గా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి వారిని సంప్రదించాడు. అనేక సమావేశాల తర్వాత, మోసగాళ్ళు వాణిజ్య లైసెన్స్, ఒక ప్రధాన డెవలపర్కు ఆపాదించబడిన ప్రాపర్టీ సేల్ డీడ్ మరియు ప్రభుత్వంతో కురుర్చుకున్న ఒప్పందం వంటి ప్రామాణికమైన డాక్యుమెంట్లను వారికి చూపించారు.
దీంతో వాళ్లు చెప్పిన ఆఫర్ నిజమైనదని నమ్మి, ఆ ఫ్యామిలీ విల్లా కొనుగోలు చేయడానికి అంగీకరించి డిపాజిట్ కింద Dh800,000 చెల్లించారు. డబ్బు అందుకున్న వెంటనే, ఆ ముగ్గురూ కనిపించకుండా పోయారు. మోసపోయిన ఫ్యామిలీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు.
క్రిమినల్ కోర్టు ఆ వ్యక్తులను దోషులుగా నిర్ధారించి, వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మోసం చేసిన మొత్తాన్ని ఐదు శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









