సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- November 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మరణించాడు. పర్వత ప్రాంతాల్లో అక్రమ పదార్థాల కొనుగోలు విషయంలో మృతుడికి, నిందితులు మధ్య ఆర్థిక వివాదం తలెత్తించింది. దీంతో సంయనం కోల్పోయిన ఇథియోపియన్ జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భారతీయులు అక్కడికక్కడే మరణించాడని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఇద్దరు ఇథియోపియన్ నేరస్థులు నిషేధిత పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వామ్యులని నిర్ధారణ అయిందని వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో భారత రాయబార కార్యాలయం ఇప్పిటివరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







